ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుషికొండ సముద్ర తీరాన డ్రగ్స్ కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2019, 05:29 PM

సాగరం తీరం క్రమక్రమంగా మాదకద్రవ్యాలకు దగ్గరవుతోంది. ఈ నెల 13న విశాఖలోని రుషికొండ ప్రాంతంలో జరిగిన ఓ పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగించిన ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సోనీ అనే వ్యక్తి నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. హుటాహుటిన అక్కడకు వెళ్లిన పోలీసులకు తనిఖీల్లో డ్రగ్స్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు.

రెండు రోజుల తరువాత అక్కడి నుంచి డ్రగ్స్‌ను తరలించేందుకు యత్నించిన సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము గోవా నుంచి విశాఖకు డ్రగ్స్‌ను తీసుకొచ్చినట్టు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. దీనికి సంబంధించి మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రగ్స్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు సోనీ మాత్రం తప్పించుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com