అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, రవాణాశాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం కేసులో టీడీపీ నేతలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. 2017లో రవాణాశాఖ కమిషనర్పై దౌర్జన్యంకు పాల్పడిన ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కేసు తదుపరి విచారణను జూన్ నెలకు వాయిదా వేసింది.