ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ ఫ్రైడే విశిష్టతను వివరించిన వైఎస్ జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2019, 02:27 PM

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రజానీకానికి సందేశం ఇచ్చారు. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి జగన్ తరఫున ప్రకటన వెలువడింది. జీసస్ మహాత్యాగానికి గుర్తే ఈ గుడ్ ఫ్రైడే అని జగన్ పేర్కొన్నారు. ఏసుక్రీస్తు కరుణామయుడని, ఆయనను శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే, ఆయన సజీవుడై వచ్చిన రోజు ఈస్టర్ సండే... ఈ రెండు దినాలు ప్రపంచ మానవాళి చరిత్రలో కీలక ఘట్టాలు అని వివరించారు. నిస్సహాయుల పట్ల ఆదరణ, కరుణ... శత్రువుల పట్ల క్షమాగుణం, అవధుల్లేని త్యాగం, ఆకాశమంత సహనం ఏసుక్రీస్తు మానవాళికి బోధించిన అంశాలు అని, ఆయన జీవితమే ఓ సందేశం అని జగన్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com