ఉగాది పర్వదినం సందర్భంగా ఏపీ ప్రభుత్వం కళారత్న అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు ఈ అవార్డులు ఇస్తారు. కళారత్న పురస్కారాలకు ఎంపికైన వారు
గొల్లపూడి మారుతీరావు, విశాఖ - నటుడు, రచయిత
వంగపండు ప్రసాదరావు, విశాఖ - జానపదం
సతీష్ రెడ్డి, నెల్లూరు - సైన్స్
గరికపాటి నరసింహారావు, తూర్పుగోదావరి - అవధానం
వేమూరి వెంకట విశ్వనాథ్, కృష్ణా - సంగీతం
సాయికృష్ణ యాచేంద్ర, నెల్లూరు - సంగీతం, అవధానం
చెరుకూరి వీరయ్య, కృష్ణా - ఇంజినీరింగ్
పొత్తూరి వెంకటేశ్వరరావు, గుంటూరు - జర్నలిజం
బల్లెం రోశయ్య, కృష్ణా - ఇంజినీరింగ్
అనంత శ్రీరామ్, పశ్చిమగోదావరి - గేయ రచయిత
ఉమా చౌదరి, గుంటూరు - హరికథ
మహంకాళి సూర్యనారాయణశాస్త్రి, గుంటూరు - కూచిపూడి
సింగమనేని నారాయణ, అనంతపురం - సాహిత్యం
పి. సత్యవతి, కృష్ణా - సాహిత్యం
కె. సంజీవరావు, యానాం - కవిత్వం
గంగాధరశాస్త్రి, కృష్ణా - సంగీతం
చిట్టూరి రేవతి రత్నస్వామి, హైదరాబాద్ - సంగీత వాయిద్యం
డా. శారదా రామకృష్ణ, కృష్ణా - ఆంధ్ర నాట్యం
ఖలీషా అండ్ సుబానీ, ప్రకాశం - నాదస్వరం
మానేపల్లి రుషికేశవరావు, కృష్ణా - సాహిత్యం
కడలి సురేష్, నర్సాపూర్ - నాటకం
మారేమని శ్రీనివాసరావు, గుంటూరు - చిత్ర లేఖనం
ఎస్ఎం పీరన్, ప్రకాశం - శిల్పకళ
జయన్న, కడప - చిత్రకళ
అక్కల శ్రీరామ్, గుంటూరు - శిల్పకళ
పల్లేటి లక్ష్మి కులశేఖర్, కడప - రంగస్థలం
ఉమామహేశ్వరి, కృష్ణా - హరికథ
నేతి పరమేశ్వర శర్మ, గుంటూరు - రంగస్థలం
ఎ. మురళీకృష్ణ, ప్రకాశం - వ్యాఖ్యాత
తమ్మలపూడి కోటేశ్వరరావు, గుంటూరు - సాహిత్యం
మీగడ రామలింగస్వామి, శ్రీకాకుళం - నాటకరంగం
నాయుడు గోపి, గుంటూరు - రంగస్థలం
పొట్లూరి హరికృష్ణ, అనంతపురం - తెలుగు భాషాభివృద్ధి
కె. శివప్రసాదరెడ్డి, కర్నూలు - హస్తకళలు
కొండపోలు బసవపున్నయ్య, గుంటూరు - సంఘసేవ
డా. టీఎస్ రావు, కృష్ణా - సంఘసేవ
మన్నెం వెంకటరాయుడు, గుంటూరు - సంఘసేవ
డా. రాధాకృష్ణంరాజు, కర్ణాటక - సంఘసేవ
![]() |
![]() |