న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని షాహిన్బాగ్లో ఇవాళ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.