కడప : నగరంలో మంగళవారం సీఎం చంద్రబాబు రోడ్షో నిర్వహిస్తున్నారు. కడప అసెంబ్లీ సీటును ముస్లిం మైనారిటీలకు కేటాయించడంతో టీడీపీ అభ్యర్థిగా అమీర్బాబు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా ముస్లింలు ఉన్న కడప నగరంలో ప్రత్యేకంగా గోకుల్సెంటర్ నుంచి సీఎం చంద్రబాబు రోడ్షో నిర్వహించి అల్మాస్పేట వద్ద బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పాల్గొంటారని సమాచారం అందింది.
రాష్ట్రంలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫరూక్ అబ్దుల్లా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. సీఎంతో పాటు ఫరూక్ అబ్దుల్లా రోడ్షోలో పాల్గొంటారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి తెలిపారు. 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కడప, కమలాపురం నియోజకవర్గాల్లో నాటి ఎన్టీఆర్తో కలిసి ఫరూక్ అబ్దుల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 27 ఏళ్ల తరువాత తిరిగి ఎన్నికల ప్రచారం కోసం సీఎం చంద్రబాబుతో కలిసి ఫరూక్ కడపకు విచ్చేస్తున్నారు.