ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోటీకి దూరంపై మురళీ మనోహర్ జోషి లేఖ?

national |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2019, 12:50 PM

న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషీ రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కాన్పూర్ లోక్ సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆయన పోటీలో లేరు. తాను పోటీకి దూరం కావడానికి పార్టీ ఆదేశమే కారణమని ఆయన రాసినట్లుగా చెప్పబడుతున్న ఒక లేఖ సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నది. ఈ సారి  కాన్పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయవద్దని పార్టీ కోరిందని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ లేఖను ఆయన కాన్పూర్ ఓటర్లను ఉద్దేశించి రాశారని చెబుతున్నారు. ఆయన రాసినట్లుగా చెప్పబడుతున్న సదరు లేఖ సారంశం ఇలా ఉంది. ‘ప్రియమైన కాన్పూర్ ఓటర్లూ..నేను కాన్పూర్ నుంచి కానీ, మరే ఇతర నియోజకవర్గం నుంచీ కానీ పోటీ చేయకూడదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ లాల్ నాకు ఒక సందేశం పంపారు అది పార్టీ నిర్ణయంగా ఆయనా సందేశంలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com