ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేఏ పాల్‌ నామినేషన్‌ను తిర‌స్క‌రించిన రిటర్నింగ్‌ అధికారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2019, 09:49 PM

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నామినేషన్‌ను తీసుకొనేందుకు రిటర్నింగ్‌ అధికారి నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేటి మధ్యాహ్నం తో ముగిసింది. తాజాగా ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌కు అనుకోని ఘటన ఎదురైంది. అతని నామినేషన్ ని అధికారులు తీసుకోలేదు. దీంతో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్‌లు కుట్ర పన్నారని వారిపై కేఏ పాల్ మండిపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...భీమవరంలో కేఏ పాల్ నామినేషన్‌ను వేసేందుకు వచ్చారు. కాగా అప్పటికే నామినేషన్ వేసే సమయం ముగియడంతో పాల్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. ఈ సందర్భంగా అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. నరసాపురంలో ఎంపీ నామినేషన్‌ను ఆలస్యంగా తీసుకున్నారని, అందుకే భీమవరం రావడం ఆలస్యమైందని కేఏ పాల్‌ ఆరోపించారు. ఎన్నికల్లో తాను ఎక్కడ గెలుస్తానో అన్న భయంతోనే భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చేశారని కేఏ పాల్ ప్రత్యర్ధి పార్టీ నాయకుల్ని విమర్శించారు. ఇదిలా ఉండగా ఎంపీగా నరసాపురంలో గెలిచి నేనేంటో చూపిస్తానని కేఏ పాల్‌ స్పష్టం చేశారు. ఆలస్యంగా వచ్చిన కారణంగానే పాల్ నామినేషన్‌ తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com