గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా వున్న ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద జయ ప్రద త్వరలోనే బీజేపీ లో చేరడం ద్వారా తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే జయ ప్రద బీజేపీ లోకి చేరడానికి రంగం సిద్ధమైందని బీజేపీ వర్గాల వల్ల తెలుస్తోంది. గతంలో జయ ప్రద గెలుపొందిన రాంపూర్ నియాజకవర్గం నించే ఆమెను పోటీ చేయించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది. జయ ప్రద తో బీజేపీ నాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపిందని , రామ్పుర నుంచి పోటీకి దించే అవకాశాలున్నాయని బీజేపీ వార్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ లో చేరి జయప్రద ఎన్నికల ప్రచారానికే పరిమితమవుతారా లేక పోటీ చేస్తారా అనేది వేచి చూడాల్సి వుంది. గతం లో సమాజ్వాదీ పార్టీ తరఫున రాంపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన జయ ప్రద ఆ తర్వాతి కాలంలో సమాజ్వాదీ పార్టీ కి దూరమయ్యారు.