ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను సోమవారం విడుదల చేసింది. ఈ నెల 24 నాటికి రాష్ట్రంలో మొత్తం 3,93,12,192 మంది ఓటర్లు ఉన్నట్టు ప్రకటించింది. జనవరి 11 తర్వాత 25,20,924 మంది ఓటర్లను చేర్చగా.. 1,41,823 మంది ఓటర్లను తొలగించినట్టు స్పష్టంచేసింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42,04,436 మంది ఉండగా.. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18,18,016 మంది ఓటర్లు ఉన్నారు.