ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీవీపీపై సంచలన ఆరోపణలు చేసిన‌ కేశినేని నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2019, 08:16 PM

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని మీడియాతో మాట్లాడుతూ తన ప్రత్యర్థి పీవీపీపై సంచలన ఆరోపణలు చేశారు.  కమల్‌హాసన్ కుమార్తె శృతిహాసన్‌ను వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ(పొట్లూరి వర ప్రసాద్) బ్లాక్ మెయిల్ చేశారని టీడీపీ అభ్యర్థి కేశినేని నాని ఆరోపించారు. కమల్‌హాసన్ గారి అమ్మాయి శృతిహాసన్‌ను బ్లాక్‌మెయిల్ చేసి కాల్ షీట్లు తీసుకున్నారు. అలాగే చాలామంది హీరోయిన్లు ఏడిపించిన వ్యక్తి ఇతను. సినిమా ఇండస్ట్రీలో మహేశ్‌బాబును తప్ప ప్రతి హీరోనూ ఇతను మోసం చేశాడు. సినిమా ఇండస్ట్రీకి కూడా ఇతనంటే అసహ్యం పుట్టింది. ఒక్క మహేశ్ బాబే ఈయన చేతికి దొరకలేదు. హీరోయిన్లను ఏడిపించాడు.. డైరెక్టర్లను ఏడిపించాడు. అవసరం అయితే లీగల్ నోటీసులని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల డేట్లు తీసుకునేవాడు. ఇతను ఏదైనా చేయడానికి సిద్ధహస్తుడు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com