వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్కి ఉరేసుకుంటే ఒక్క ప్రాణమే పోతుందని, అదే ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే అందరి ప్రాణాలు పోతాయని వ్యాఖ్యానించారు. జగన్ కేసుల మాఫీ కోసమే షర్మిల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజధానిలో అభివృద్ధిని చూస్తే షర్మిల కూడా టీడీపీకే ఓటేస్తారని అన్నారు. ఏపీపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ప్రాణస్నేహితుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని కాదని అలీ వైసీపీలో చేరడం వెనుకన్న కారమేంటి? అని ప్రశ్నించారు. ఆస్తుల్ని లాక్కుంటామని అలీని కేసీఆర్ ఏమైనా బెదిరించారా అని అన్నారు. కేసీఆర్ పథకంలో భాగంగానే మోహన్ బాబు ధర్నా డ్రామా ఆడారని, ఇదే సమయంలో మోహన్బాబుపైనా దివ్యవాణి విమర్శలు గుప్పించారు.