టీడీపీ మేనిఫెస్టోపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూపాయి పెట్టుబడి లేకుండా కేవలం రైతుల నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి చంద్రబాబు చేసిన భూ సమీకరణ చూసి ప్రపంచమే నోరెళ్ల బెట్టిందని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు చేసిన భూ సమీకరణను చూసి కేసీఆర్గారే హ్యాట్సాఫ్ చెప్పారు. అభివృద్ధి అజెండాగా.. తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం ముందుకు వెళుతోంది. తాము విడుదల చేయబోయే మేనిఫెస్టో కూడా పేదల పక్షపాతిగా ఉండబోతోందన్నారు.
నేడు రూ.2000 చేసిన పింఛన్ను రూ.3000లకు పెంచుతున్న దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టబోతున్నామని, పేద, బడుగు, బలహీన వర్గాలను రంజింపచేసే విధంగా మేనిఫెస్టో ఉండబోతోందని, అది తుది మెరుగులు దిద్దుకుంటోం దన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు కేవలం పింఛన్ల ద్వారానే.. నెలకు 22 వేల కోట్ల రూపాయలు.. సుమారు 70 లక్షల ఇళ్లకు చేర్చడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం 4 లక్షల ఇళ్లు సిద్ధమైపోయాయని తెలిపారు.