కృష్ణాజిల్లా మంగనపూడి బీచ్ లైట్ హౌజ్ వద్ద తన హోదాను మరిచి జనసేనాని పవన్కల్యాణ్ సామాన్యుడిలా సింపుల్ సిటీని చాటుకోవడం అందరినీ ఆకట్టు కుంటోంది. 50 కోట్లు పారితోషికం తీసుకునే వీలున్న, పట్టు పాన్పుల్లో పవళించే అవకాశం వున్నా..తనకు ఆతిథ్యం ఇవ్వడానికి స్టార్ హోటళ్లు ఎదురుచూస్తున్నా కటిక నేల పై కూర్చుని ఓ సామాన్యుడిలా పవన్కల్యాణ్ భోజనం చేయడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాయి.
కృష్ణా జిల్లాలో తన అభ్యర్థుల తరుపున ప్రచారం మొదలుపెట్టాన పవన్కల్యాణ్ తీరిక లేకుండా బిజీ షెడ్యూల్తో ప్రచారం హోరెత్తించారు. అయితే కొంత విరామం తీసుకోవడం కోసం మచిలీపట్నం సమీపంలోని మంగనపూడి బీచ్ లైట్ హౌజ్ వద్ద గల ఓ చెట్టుకిందికి చేరిన పవన్ నేలపై కూర్చుని మట్టి పాత్రలో జొన్న అన్నం మజ్జిగలో కలుపుకుని పచ్చిమిరపకాయ్ పచ్చడిని నంజుకుంటూ వాతావరణాన్ని పవన్ ఆస్వాదిస్తూ భోజనం ఆరగించారు. భోజనం ముగించుకున్న అనంతరం వేపచెట్టుకింద తాటాకు చాపపై సేదతీరడం పలువురిని ఆకర్షిస్తోంది.