ఢిల్లీ: ఏపీలో పోలీసులు వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి తదితరులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తన సామజిక వర్గానికి చెందిన వారిని డీజీలుగా చేసుకొని చంద్రబాబు వైసీపీ సానుభూతిపరుల మీద కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ చేర్చిన బోగస్ ఓట్లను తొలగించేందుకు వైసీపీ కార్యకర్తలు పెట్టిన ఫామ్ 7 దరఖాస్తులపై అనవసర కేసులు పెట్టారని.. మొత్తం 423 కేసులను పెట్టారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈసీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఈసీ వెల్లడించారు.