గుంటూరును విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అవినీతిపై నిరంతరం పోరాటం చేద్దామన్నారు. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దామన్నారు. రాజకీయాలు కొన్ని కుటుంబాల మధ్యనే సాగుతోందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు దమ్ము ధైర్యం లేదన్నారు. మార్పు రావాలంటే అది జనసేనతోనే సాధ్యమవుతుందన్నారు.