ఆదోని: బాబు హయాంలో ఏ ఒక్క హామీ నెరవేరలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహిస్తున్న ప్రచార సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు ప్రతి అడుగులో కనిపించేది మోసం, అబద్ధం, వంచన అన్నారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. పాదయాత్రలో పేదల కష్టాల్ని చూశానని జగన్ అన్నారు. ఉల్లి, టమాటా, పత్తి పంటలది ఒక్కటే పరిస్థితి అన్నారు. దళారులకు కెప్టెన్ చంద్రబాబు అని విమర్శించారు. ఉల్లి పంటకు రేటు లేక రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారన్నారు. హెరిటేజ్ షాపుల్లో కిలో రూ.23లకు అమ్ముతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగుల ప్రతి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. వీలైనంత మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని, సమాన పనికి సమాన వేతనం అందిస్తామన్నారు. పోలీసులకు చంద్రబాబు వేసిన పచ్చ చొక్కాలను తొలగిస్తామన్నారు. పోలీసులకు వారానికి ఒక రోజు సెలవు ఇస్తామన్నారు.