అధికారంలోకి రాగానే రూ.3వేలు పెన్షన్ అందిస్తామని, మేనిఫెస్టోలో పెట్టబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సును తగ్గిస్తామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే అదనంగా చేశామన్నారు. ఉచితంగా ఇళ్లు నిర్మించి తీరుతామన్నారు. రూ.3.91 కోట్ల ఓటర్లలో 98 లక్షల మందికి పసుపు కుంకుమ ఇచ్చామన్నారు. 65 లక్షల మందికి పెన్షన్లు, నిరుద్యోగ భృతి ఇస్తున్నామని పేర్కొన్నారు. 45 లక్షల మంది రైతులకు అన్నదాతా సుఖీభవ వర్తిస్తోందన్నారు. 2014లో ఇచ్చిన హామీలు సాధ్యం కావన్నారని, సాధ్యం చేసి చూపించామన్నారు.