తులసీవనంలో గంజాయి మొక్క పుట్టింది.. అది జగన్మోహన్ రెడ్డేనని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కడప జిల్లా బద్వేలులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…. కడప జిల్లాలో ఎందరో మహానుభావులు పుట్టారన్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి, అన్నమయ్య ఈ జిల్లావారేనని అన్నారు. వీరారెడ్డి ఈ జిల్లాకు చేసిన సేవలు ఎప్పటికీ మరవలేమన్నారు. విలువలు కలిగిన వ్యక్తి, ఒక మంచి నాయకుడు వీరారెడ్డి అన్నారు. ప్రజాసేవను ముందుకు తీసుకెళ్దామని వీరారెడ్డి కుటుంబం ముందుకొచ్చిందన్నారు.