బెంగళూరు : మాండ్య ఎంపీగా పని చేసిన దివంగత అంబరీష్ సతీమణి సుమలతకు బీజేపీ అండ దొరికింది. తన భర్త స్థానంలో తాను కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగాలని భావించిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ చెయ్యిచ్చింది. దీంతో ఆమె మాండ్య స్థానం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. ఈ స్థితిలో మాండ్యలో పార్టీ అభ్యర్థిని నిలబెట్లకుండా సుమలతకు మద్దతివ్వాలని బీజేపీ నిర్ణయించింది.అసలు కాంగ్రెస్ పార్టీ సుమలతకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణమేమిటంటే జేడీఎస్ నాయకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, అంటే కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడను మాండ్య నుంచి జేడీఎస్ అభ్యర్థిగా నిలబెట్టడమే. అందుకే సుమలతకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. అయితే అనూహ్యంగా సుమలత ఇండిపెండెంట్ గా రంగంలోనికి దిగడం, ఆమెకు బీజేపీ మద్దతు ప్రకటిస్తూ అభ్యర్థిని నిలపకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ లు కంగుతిన్నాయి.