గుంటూరు: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గుంటూరు జిల్లా రేపల్లెలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ ప్రచార సభకు భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రేపల్లెలో ప్రచారం అనంతరం చిలకలూరిపేటలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం కృష్ణా జిల్లాలోని తిరువూరులో జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. మత్స్యకారులకు చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. ఆక్వా రైతులు ఈ ఐదేళ్లలో నష్టాలు మూటగట్టుకున్నారన్నారు. ఆక్వా రైతులను దళారులు దోచుకున్నారన్నారు. రైతుకు మిగిలేది కష్టం, నష్టం అన్నట్లుగా పాలన ఉందని విమర్శించారు. రైతుల కష్టాలను తాను దగ్గరగా చూశానన్నారు. అన్నం పెట్టే రైతు ఆకలితో మాడుతున్నాడన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, బీమా లేదు, పెట్టుబడి లేదని పేర్కొన్నారు.