ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1న రాజమహేంద్రవరంలో మోదీ సభ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 24, 2019, 01:06 PM

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మరోసారి ఏపీకి రానున్నారు. ఏప్రిల్‌ 1న రాజమహేంద్రవరంలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక్కడి స్పిన్నింగ్‌ మిల్లు మైదానంలో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే సభలో మోదీ ప్రసంగిస్తారని భాజపా నేత సోము వీర్రాజు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగిందన్నారు. రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే సీఎం చంద్రబాబు 2లక్షలు మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతోంది రూలింగ్‌ కాదు.. ట్రేడింగ్‌ అని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com