జకార్తా: ఇండోనేషియాలో ఉత్తర మలక్కా ప్రాంతంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 6.6గా నమోదైంది. ఇప్పటి వరకూ ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఇండోనేషియాలో టెర్నెట్కు 150 కిలోమీటర్ల దూరంలో 37 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అతి తక్కువ సమయం మాత్రమే భూప్రకంపనలు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. ఇండోనేషియాలో తరచూ భూకంపాలు రావడం, అగ్నిపర్వతాలు బద్దలవడం జరుగుతుంది. అత్యంత ప్రమాదకరమైన రింగ్ఆఫ్ ఫైర్ జోన్లో ఇది ఉంది. గత సెప్టెంబర్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించి దాదాపు 2,200 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.