అమరావతి : గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ప్రముఖులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ, ప్రస్తుత అభ్యర్థి కూడా అయిన రాయపాటి సాంబశివరావుతోపాటు కలసి వచ్చిన గుంటూరు జిల్లా కోఆపరేటీవ్ సెంట్రల్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ నల్లపాటి చంద్రశేఖరరావు, ఆయన కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో నల్లపాటి చంద్రశేఖరరావుతోపాటు ఆయన తనయుడు ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు నల్లపాటి వెంకట్రామయ్య చౌదరి మనుమడు నల్లపాటి రాము, తదితరులున్నారు.