మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఏపీపై కక్షగట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహిస్తున్న ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. జగన్కు మోడీ, కేసీఆర్ సహకరిస్తున్నారన్నారు. తనకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. ఒప్పుకుంటారా… ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిందన్నారు. మా రాష్ట్రంపై కేసీఆర్ పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు. జగన్ 31 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. జగన్ అఫిడవిట్లో అంతా కేసుల చిట్టానేనని విమర్శించారు. కేసీఆర్… జగన్కు వెయ్యి కోట్లు పంపించాడన్నారు.