కర్నూలు జిల్లా ఆదోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. బ్యాంక్కు సెలవు కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటల్లో రికార్డులు, కంప్యూటర్లు, ఫర్నీచర్ కాలి బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అటు.. బ్యాంక్లో అగ్ని ప్రమాదంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది.