లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ మద్దతుతో విజయనగరం స్వతంత్ర ఎంఎల్ఎ అభ్యర్థి గా విజయనగరం ఎంఆర్ఒ కార్యాలయంలో లోక్సత్తా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బిసెట్టి బాబ్జి శుక్రవారం నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట రమణ రెడ్డి కి బాబ్జి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ... విజయనగరం రాజులను గెలిపించడం వల్ల, వైసిపి నాయకులను గెలిపించడం వల్ల, విజయనగరం ప్రజలకు ఏమీ ఉపయోగం లేదన్నారు. తనలాంటి సామాన్యుడిని గెలిపిస్తే విజయనగరాన్ని అభివఅద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. తనలాంటి సామాన్యుడిని గెలిపించి విజయనగరంలో కొత్త మార్పుకి ప్రజలు శ్రీకారం చుట్టాలని కోరారు. ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని, వారికి అన్ని విధాలా అందుబాటులో ఉంటానని బాబ్జి పేర్కొన్నారు.