చెన్నై : అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఎఎంఎంకె) అధ్యక్షుడు టిటివి దినకరన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమ పార్టీ అభ్యర్థుల తుది జాబితాను శుక్రవారం విడుదల చేశారు. 14 మందితో తుది జాబితాను దినకరన్ విడుదల చేశారు. అధికార పార్టీలో వివక్షకు గురై, ఆ పార్టీనుంచి బైటికి వచ్చిన ముగ్గురు ఐఎఐడిఎంకె ఎమ్మెల్యేలకు దినకరన్ విడుదల చేసిన జాబితాలో చోటు లభించింది.