పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ… సొంత మామనే కుట్ర చేసి చంపిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు హయాంలోనే కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎదురుచూపులే మిగిలాయన్నారు. పులివెందులకు వచ్చి చంద్రబాబు మోసం చేసే మాటలు మాట్లాడారన్నారు. పులివెందుల గడ్డ మీడ పుట్టినందుకు గర్వ పడుతున్నానన్నారు.చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది టీడీపీ వాళ్లే.. మళ్లీ విచారణ చేయించేదీ వీళ్లే జగన్మోహన్ రెడ్డి అన్నారు. తప్పుడు విచారణలు చేయించి వీళ్లకు కావాల్సినట్టుగా రాయిస్తారన్నారు. ఏ కేసులైనీ వీరికి అనుకూలంగా మార్చుకుంటారన్నారు. కడప జిల్లాలో టీడీపీ గెలవలేదేమోనన్న భావనకు వచ్చారన్నారు. అందుకోసమే జిల్లాలో కుట్రలకు పాల్పడ్డారన్నారు. జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనూ టీడీపీ ఓడిపోయే పరిస్థితి ఉందన్నారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు డబ్బులతోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారని అన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఇద్దరూ కలిసి డ్రామాలాడుతున్నారన్నారు. టీడీపీ, మాజీ జేడీ లక్ష్మీనారాయణలు కలిసి ఏ పనులు చేశారో మీకు తెలుసన్నారు. భీమిలి నుంచి మాజీ జేడీకి చంద్రబాబు మొదట సీటు ఇవ్వాలనుకున్నారని.. అయితే ప్రజా వ్యతిరేకతతో భీమిలి టికెట్ ను మార్చి తన పార్టనర్ పార్టీలో చేర్పించి విశాఖ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారన్నారు. నిన్న వీళ్ల డ్రామాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే…పవన్ నామినేషన్ వేస్తే టీడీపీ, జనసేన జెండాలు కనిపించాయన్నారు జగన్. ప్రతిపక్షం ఓట్లను చీల్చేందుకు చంద్రబాబు డ్రామాలు, జిత్తులు వేస్తున్నారన్నారు.