అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని నటుడు శివాజీ కలిశారు. ఎన్నికల సందర్భంగా ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు, జీఎస్టీ దాడులపై శివాజీ ఫిర్యాదు చేశారు. అధికారుల దాడులతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. బ్యాంకుల నుంచి మనీ తీసుకెళ్తుండగా.. తగిన ఆధారాలు చూపించినా నగదు సీజ్ చేయడంపై ద్వివేది దృష్టికి తీసుకెళ్లారు. సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఈవోకి శివాజీ విజ్ఞప్తి చేశారు.