వాషింగ్టన్ : ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. లోక్సభ ఎన్నికల తరువాత ఈ బంధం మరింత బలోపేతమవుతుందని ట్రంప్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెరికాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఒక ప్రకటన విడుదల చేస్తూ గత ఏడాది న్యూఢిల్లిలో జరిగిన టూ ప్లస్ టూ చర్చలు ఇరు దేశాల సంబంధాలను ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడ్డాయని అన్నారు.