న్యూఢిల్లి : పాకిస్తాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి వెళ్లరాదని భారత్ నిర్ణయించుకుంది. ఇక్కడి పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి జమ్ము కాశ్మీర్లో వేర్పాటువాద నేతలైన హుురియత్ కాన్ఫరెన్స్ నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నేపథ్యంలో ఉత్సవానికి హాజరు కారాదని భారత్ నిర్ణయించుకుంది. ప్రతియేడాది మార్చి 23వ తేదీన పాకిస్తాన్ జాతీయ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తారు.