న్యూఢిల్లీ : బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. కేంద్రమంత్రి జేపీ నడ్డా 182 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. ప్రధాని నరేంద్రమోదీ రెండోసారి వారణాసి పోటీ చేయనున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గాంధీ నగర్ (గుజరాత్ ) లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనుండగా..రాజ్ నాథ్ సింగ్ లక్నో (యూపీ) లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. నితిన్ గడ్కరీ నాగ్ పూర్ (మహారాష్ట్ర), హేమమాళిని మధుర (యూపీ), స్మృతి ఇరానీ అమేథీ (యూపీ) నుంచి ఎన్నికల బరిలో నిలువనున్నారు.