ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తంబాలపల్లిలో టీడీపీకి షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2019, 04:07 PM

తంబాలపల్లి నియోజకవర్గంలో  టీడీపీకీ  అసెంబ్లీ ఎన్నికల ముందర గట్టి షాక్ తగిలింది.  ఆ పార్టీకి చెందిన తెలుగునాడు  రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా దొరస్వామి నాయుడు టీడీపీకి రాజీనామా చేశాడు. రెబెల్ అభ్యర్థిగా ఎల్లుండి నామినేషన్ వేయడానికి సిద్ధమవ్వడం టీడీపీ అధిష్టానాన్ని షాక్ కు గురిచేసింది. అది చిత్తూరు జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం.. ఆది నుంచి పార్టీని నమ్ముకొని పార్టీకోసం పనిచేసి బలంగా తీర్చిదిద్దిన నాయకుడతను. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ టీడీపీ ఆ వీరవిధేయుడికి మొండి చేయి చూపించింది. దీంతో ఆయన నమ్మిన పార్టీని వదిలేశాడు. ఇప్పుడు ఏకంగా టీడీపీపైనే రెబల్ గా పోటీచేసి ఓడించేందుకు రెడీ కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. 12 సంవత్సరాలుగా టీడీపీ కోసం దొరస్వామి పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కి చంద్రబాబు, లోకేష్ బాబుకు చాలా సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు లో చాలా చురుగ్గా పాల్గొంటూ యువత లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.  తంబల్లిపల్లిలో ముఖ్యంగా ఏవీ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీని వీడిన సమయంలో నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీని బతికించాడు.. ముందుకు నడిపించాడు. తెలుగుదేశం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి యువత లో ఉత్సాహాన్ని నింపి  సొంత నిధులను వెచ్చించారు.


 2014 ఎన్నికల్లో తనకు తంబాలపల్లి టికెట్ ఇవ్వకున్నా టీడీపీ అభ్యర్థి శంకర్ యాదవ్ గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఈసారి కూడా టీడీపీ హ్యాండివ్వడంతో ఇక టీడీపీపై పోరుకు రెడీ అయ్యారు. ఒంటరిగా బరిలోకి దిగుతూ టీడీపీకి చెమటలు పట్టిస్తున్నాడు. దొరస్వామికి నియోజకవర్గంలోని 6మండలాల్లోని 3 మండలాల్లో  అనుచరగణం బంధువులు ఉన్నారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గంకు సన్నిహితంగా కలిసొచ్చే అంశాలు... దొరస్వామి నాయుడకు మాజీ ఎమ్మెల్యేతో పాటు అనుచరులు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు.దీంతో టీడీపీకి ఇక్కడ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com