హైదరాబాద్: వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో ఇవాళ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. గత మూడు రోజుల నుంచి ప్రియాంక గంగా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ప్రయాగ్రాజ్ నుంచి ఆమె బోటులో ప్రయాణిస్తూ.. లోక్సభ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇవాళ వారణాసి చేరుకున్న ఆమె మొదట ఓ ఘాట్లో గంగా నదికి హారతి సమర్పించారు. ప్రయాగ్రాజ్లోని మనయా ఘాట్ నుంచి వారణాసిలోని అస్సి ఘాట్ వరకు ప్రియాంక టూర్ సాగింది. అంతకముందు ఇవాళ తన బ్లాగ్లో ప్రధాని మోదీకి ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. ప్రజలు మూర్ఖులని నమ్ముతున్న మోదీ ఆ ఆలోచన నుంచి బయటకు రావాలని ఆమె అన్నారు. మోదీ అధికారం దాహాంతో ఉన్నారని.. ఎవరినైనా ఏమైనా చేయగలరన్న ధీమాతో ఆయనున్నారన్నారు.