అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు తాడేపల్లి టౌన్ లో లోకేశ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు తాడేపల్లి టౌన్ 20 వ వార్డు లోని ఆంజనేయ స్వామి దేవాలయం లో లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శవరాజకీయ పార్టీ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగళగిరి టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలో నారా లోకేశ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి ఇదేమైనా పేకాటా? అని ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు సీఎం కావాలన్నారు. వివేకానందరెడ్డి చనిపోతే తనకు బాధేసిందన్నారు. వివేకాను హత్య చేసి గుండెపోటుగా ప్రచారం చేశారని విమర్శించారు.