ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్ లో బాంబు కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2019, 10:58 AM

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాంబు కలకలం చెలరేగింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలం ఇంగ్లీష్ పాలెంలో బాంబులను దాచినట్లు పోలీసులకు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈరోజు ఇంగ్లీష్ పాలెంలోని ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో దాచిని బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలిపామనీ, విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ బాంబును ఎవరు తెచ్చారు? దాడి చేయడానికి సిద్ధమవుతున్నారా? ఎవరినైనా లక్ష్యంగా చేసుకున్నారా? అనే కోణంలో విచారణ సాగుతున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com