మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్ధీగా పోటీ చేస్తానని సుమలత ప్రకటన.బీజేపీ ,కాంగ్రెస్ కు దూరంగా అంబరీష్ భార్య సుమలత. తన నిర్ణయం ఎవరికైన బాధించి ఉంటే క్షమించాలన్న సుమలత అన్నారు.అంబరీష్ ఆశయ సాధన కోసమే పోటీ చేస్తున్నానన్న సుమలత.మాండ్య పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు స్వయంగా ప్రకటించి.. రాజకీయ యుద్ధాకి తెరతీశారు.
మాండ్య ఎంపీ కోసం సుమలత కొన్నాళ్లుగా పట్టుబడుతున్నారు. పొత్తుల్లో భాగంగా జేడీఎస్ కు ఆ సీటు వెళ్లింది. సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ స్వయంగా అక్కడి నుంచి పోటీకి దిగుతుండటంతో.. కాంగ్రెస్ నో చెప్పింది. ఆ తర్వాత ఆమె బీజేపీలోకి వెళతారనే ప్రచారం జరిగినా.. అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు. ఏకంగా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతుండటంతో సంచలనంగా మారింది. మాండ్య సీటును సుమలత పట్టుబట్టటానికి కారణం.. అక్కడి నుంచి అంబరీష్ మూడు సార్లు ఎంపీగా, ఓసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.