ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివేకా హత్యతో నాకు సంబంధం లేదు: పరమేశ్వర్‌రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 04:34 PM

తిరుపతి:  వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని హత్య కేసులో అనుమానితుడు, సింహాద్రిపురం మండలం కసునూరుకు చెందిన పరమేశ్వరరెడ్డి అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మాట్లాడుతూ అనవసరంగా ఈ కేసులో తనను ఇరికిస్తున్నారన్నారు. ఇది ఇంటి దొంగల పనేనన్నారు. రాజకీయ కుట్ర కోసం వాడుకుంటున్నారన్నారు. గుండె సమస్య ఉంటే తిరుపతిలో చికిత్స తీసుకుంటున్నానన్నారు. మాకెలాంటి అభిప్రాయభేదాలు లేవన్నారు. ఆరోగ్యం బాగాలేకపోవడంతోనే వివేక అంత్యక్రియలకు హాజరు కాలేకపోయానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com