యూపీలోని మథురా బరసానా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణి అయిన ప్రియురాలిని ప్రియుడు చంపేసి మృతదేహాన్ని బావిలో పడేశాడు. గుడియా (20) అనే యువతి వినోద్ అనే వ్యక్తిని ప్రేమించి అతడితో పారిపోయింది.
అయితే అతనికి అప్పటికే పెళ్లి అయింది. దీంతో గర్భిణి అయిన గుడియాను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేశాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
![]() |
![]() |