న్యూఢిల్లి : బోయింగ్ విమానాలను నిలిపివేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) నిర్ణయం తీసుకుంది. బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలపై డిజిసిఎ నిషేధం విధించింది. నేటి మధ్యాహ్నం 4 గంటలనుంచి ఈ విమానాలను హేంగర్స్కే పరిమితం చేయనున్నారు. ఇథోపియా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం ఘోర ప్రమాదానికి గురైన సంఘటన అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ఈ విమానాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ విమానాలపై నిషేధం విధించాయి.