నియంత చేతుల్లోకి అధికారం వెళ్లకూడదనే ఏకైక లక్ష్యంతో టీడీపీ పార్టీలోకి వెళ్తున్నట్లు వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. ఇటీవల వైసీపీని వీడిన అనంతరం కొద్ది రోజుల పాటు ఏ పార్టీలోనూ చేరుతానన్న సంకేతాలివ్వని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అనూహ్యం నిర్ణయం తీసుకున్నారు. నిన్న అర్థారాత్రి, ఈరోజు వరుసగా రెండుసార్లు రాధా సీఎం చంద్రబాబు తో భేటీ అయ్యారు. తనను నమ్మిన పేద ప్రజల కోసం తాను ఎన్ని నిందలు మోసేందుకైనా సిద్ధమని రాధా ప్రకటించారు. తన తండ్రి రంగా ఆకాంక్షను నెరవేర్చానన్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు.