ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయంలో వేడుకగా మహాశాంతి తిరుమంజనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 09:27 PM

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకానికి సంబంధించిన వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం  బింబవాస్తు, నవకలశ స్నపనం, చతుర్దశ కలశ స్నపనం, హోమం, పూర్ణాహుతి చేపట్టారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో శ్రీవారి మూలమూర్తికి విశేషంగా అభిషేకం చేశారు. ఈ అభిషేక దర్శనం భక్తులకు కనువిందు చేసింది. ఆ తరువాత మహాశాంతి పూర్ణాహుతి, రక్షాబంధనం, కుంభారాధనం, నివేదనం, శయనాధివాసం, హౌత్రం, సర్వదేవతార్చన, హోమం కార్యక్రమాలు నిర్వహించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com