ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్యాన్స్ చేశాడని ఉద్యోగంలోంచి తొలగించిన అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 07:46 PM

రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ తన ఇంటి వద్ద కార్యకర్తలతో జరుపుకున్న హోలీ వేడుకల్లో.. ఓ పోలీసు అధికారిని డ్యాన్స్ చేయమంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్లే చేసిన పాటకు నృత్యం చేయకపోతే ఉద్యోగంలోంచి తొలగిస్తానంటూ ఆయన బెదిరించగా.. భయపడిన పోలీస్ రెండు స్టెంప్పులు వేశారు. అయితే ఓ ఎమ్మెల్యే ఆదేశాలతో డ్యాన్స్ చేయడం సరైన పద్దతి కాదంటూ పోలీసు పైఅధికారులు అతడిని ఉద్యోగంలోంచి తొలగించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజ్ ప్రతాత్ సింగ్ యాదవ్ శనివారం రోజు పాట్నాలోని తన అధికారిక నివాసంలో పార్టీ కార్యకర్తలతో కలిసి హోలీ వేడుకలు జరపుకున్నారు. అయితే ఈ వేడుకల్లోనే తన అంగరక్షడిగా పని చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ దీపక్ కుమార్‌ను డ్యాన్స్ చేయమంటూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా యూనిఫాంలోనే ఉన్న అతడిని నృత్యం చేయమని.. చేయకపోతే ఉద్యోగంలోంచి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. దీంతో భయపడిన అతడు ఇబ్బంది పడుతూనే రెండు స్టెప్పులు వేశారు.


ఇందుకు సంబధించిన వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ కాగా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఓ రాజకీయ నాయకుడు ఇలా వ్యవహరించడం చాలా దారుణం అంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన తేజ్ ప్రతాప్ యాదవ్.. తన అంగరక్షకుడిగా పని చేస్తున్న పోలీసు అధికారి తన తమ్ముడితో సమానం అని, ఆ చనువుతోనే అతడిని డ్యాన్స్ చేయమని అడిగానంటూ వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ ఇతర పార్టీల నేతలు తేజ్ ప్రతాప్ యాదవ్‌పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.


ఇదంతా ఇలా ఉండగా.. ఈ వీడియో కాస్తా పోలీసు అధికారుల కంట పడింది. దీంతో కానిస్టేబుల్ దీపక్ కుమార్‌ను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు పాట్నాలోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా దీపక్ కుమార్‌ను.. తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ అంగరక్షకుడి పదవి నుంచి తొలగించి.. వేరే కానిస్టేబుల్‌ను ఈ పదవిలో పెడుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా కానిస్టేబుల్ దీపక్ కుమార్‌ను పోలీసు శాఖలోకి మారుస్తున్నట్లు వివరించారు.


ఇదిలా ఉండగా.. హోలీ వేడుకల అనంతరం తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ ఓ ద్విచక్రవాహనంపై వెళ్లారు. ఈ సమయంలో హెల్మెట్ ధరించలేరు. అలాగే గడువు ముగిసిన భీమా, కాలుష్య ధ్రువీకరణ పత్రాలు కల్గి ఉండడంతో.. ట్రాఫిక్ పోలీసులు అతడిపై 4 వేల రూపాయల జరిమానా విధించారు. ఇలా తేజ్ ప్రతాస్ సింగ్ యాదవ్‌కు షాకుల మీద షాకులు తగులుతుండగా.. ఇతర పార్టీల నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com