తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సాధారణ సర్వదర్శనానికి 8 గంటలు, నిర్దేశిత దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 62,909 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,246 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.66 కోట్లుగా ఉంది.