శ్రీకాకుళం, ఫిబ్రవరి 22 : మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమంగా జిల్లాలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం.రామారావు శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు రోడ్ల కూడలి, జాతీయ రహదారి నుండి శ్రీకాకుళం పట్టణ ప్రవేశం వద్ద, 80 ఫీట్ రహదారి వద్దగల ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలాలంకరణ కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికార అనధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు