గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ట్రస్ట్ ల సేవలు విస్తృతం కావాలని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆకాంక్షించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ 18వ వార్షికోత్సవానికి ప్రత్యేక అతిధిగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ హాజరయ్యారు. తెలుగులో ప్రసంగం చేసిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ట్రస్ట్ వార్షికోత్సవం కి హాజరుకావడం ఆనందంగా ఉందని అన్నారు. గ్రామ స్వరాజ్యంతోనే రామరాజ్యం సిద్ధిస్తుందని మహాత్మగాంధీ అన్నారు. గ్రామీణ ప్రజల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించడం ట్రస్టు లక్ష్యమన్నారు. సమాజంలో ఎవరు ఎంత ఎదిగినా అందుకు కారణమైన సమాజాభివృద్ధికి సేవ చేయాలని కోవింద్ సూచించారు. రాజకీయాలలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. అజాత శత్రువుగా, సంప్రదాయాలకు విలువనిచ్చే అరుదైన నేత వెంకయ్య నాయుడు అని ఉపరాష్ట్రపతిని కొనియాడారు. ఢిల్లీలో ఉన్నప్పటికి గ్రామీణ సంస్కృతి సంప్రదాయానికి విలువిస్తూ.. పాటిస్తూ ఉండే వ్యక్తి వెంకయ్య నాయుడని రాష్ట్రపతి కోవింద్ కితాబిచ్చారు.