న్యూఢిల్లి : జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని ఝబువా జిల్లా రైతులు పాకిస్తాన్కు టమోటాలు ఎగుమతి చేయడాన్ని నిలిపివేశారు. ట ఉగ్రదాడిని నిరసిస్తూ తీసుకున్న ఈ నిర్ణయానికి మోటాలు పండించే సుమారు 5 వేల మంది రైతులు మద్దతు పలికారు. తాము టమోటాలు పండిస్తామని, పాకిస్తాన్కు కూడా టమోటాలు ఎగుమతి చేస్తున్నామని రవీంద్ర పాటిదార్ అనే రైతు చెప్పారు. అయితే మన తిండి తిన్న పాకిస్తానీయులు మన సైనికులను చంపుతున్నారని ఆయన అన్నారు. పాకిస్తాన్ నాశనం కావాలని తాము కోరుకుంటున్నామని ఆయన అన్నారు. పాకిస్తాన్కు ఇతర దేశాలు కూడా టమోటాలను ఎగుమతి చేయకుండా ఉండేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.