తిరుపతి : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు రాహుల్.. ఇవాళ అలిపిరి మార్గంలో ఉన్న కాలినడక బాట ద్వారా తిరుమలకు పయనమైనారు. మెట్ల మార్గంలో రాహుల్ .. తిరుమలకు బయలుదేరారు. రాహుల్ వెంట ప్రియాంకా గాంధీ కుమారుడు రెహాన్ వద్రా కూడా వెళ్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో కాలిబాటన వెళ్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. మధ్యాహ్నం 2.20 నిమిషాలకు తిరుపతిలోని తారకరామ స్టేడియంలో రాహుల్ బహిరంగ సభలో పాల్గోనున్నారు.