సియోల్: ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ సియోల్ శాంతి బహుమతిని అందుకున్నారు. దక్షిణకొరియా రాజధాని సియోల్లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీకి ఈ అవార్డును ఆ దేశం అందజేసింది. సియోల్ పీస్ ప్రైజ్ను అందుకున్న తర్వాత మోదీ మాట్లాడారు. ఈ అవార్డు తనకు దక్కిన వ్యక్తిగతమైన గౌరవం కాదని, ఇది దేశ ప్రజలకు చెందుతుందని అన్నారు. గత అయిదేళ్లలో భారత్ సాధించిన ప్రగతికి ఈ అవార్డు నిదర్శనమన్నారు. 130 కోట్ల మంది భారతీయుల సత్తాకు ఈ అవార్డు దక్కుతుందన్నారు. మహాత్మా గాంధీకి 150వ జయంతి జరుగుతున్న సంవత్సరంలో ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఫీలవుతున్నట్లు మోదీ చెప్పారు. 1988లో సియోల్లో ఒలింపిక్స్ క్రీడలు జరగడానికి కొన్ని వారాల ముందే ఆల్ ఖయిదా అనే ఉగ్రవాద సంస్థ ఏర్పడిందని, ఇప్పుడు తీవ్రవాదం, ఉగ్రవాదం .. ప్రపంచదేశాలకు సమస్యగా మారిందన్నారు. ప్రపంచ శాంతి, భద్రతకు ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందని మోదీ అన్నారు.